Sunday, 4 December 2016

గౌతమీపుత్రుడి సమరనాదం

బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకుడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్‌రెడ్డి, జె.సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ మొరాకోలో ఇటీవలే పూర్తయింది. 

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఎన్నో హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకున్న మొరాకోలోని అట్లాస్ స్టూడియో, వరు జార్జియస్‌లో చిత్రీకరణ జరిపాం. ఒకటవ శతాబ్దం నాటి కాలమాన పరిస్థితుల్ని మన కళ్లముందుంచే లొకేషన్లలో ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో భారీ పోరాట ఘట్టాల్ని తెరకెక్కించాం. బాలకృష్ణ, ప్రతినాయకుడు కబీర్‌బేడికి మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాల్ని చిత్రీకరించాం. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రెండు వందల గుర్రాల్ని, ఒంటెలను ఉపయోగించాం. ఈ యుద్ధ ఘట్టాల్లో దాదాపు 1000మంది పాల్గొన్నారు. మొరాకోలో తొలిసారి చిత్రీకరణ జరుపుకున్న భారతీయ చిత్రంగా గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్ర సృష్టించింది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం క్రింద పరిపాలించిన మహా చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. తెలుగువారందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది.

భారతదేశంలోనే మహాయోధుడైనటువంటి గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్రను వెండితెర దృశ్యమానం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాము. దర్శకుడు క్రిష్ జనరంజకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్,ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతం: దేవీశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, దర్శకత్వం: క్రిష్.

No comments:

Post a Comment